అక్షరటుడే వెబ్డెస్క్: Meenakshi Natarajan Petition | రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు( Meenakshi Natarajan ) ఊరట లభించలేదు. ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం, ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
Meenakshi Natarajan Petition |కోర్టు ఏమంది?
నామినేషన్ పత్రాల తిరస్కరణ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్నట్లు ఎక్కడైనా తీర్పులు ఉంటే చూపాలని మీనాక్షి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకసారి నామినేషన్ తిరస్కరణకు గురైతే, దానికి సంబంధించి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలే తప్ప, సుప్రీంకోర్టు ఇందులో ఏమీ చేయలేదని కోర్టు తేల్చి చెప్పింది.

Meenakshi Natarajan Petition | సింఘ్వీ వాదనలు..
దీనిపై స్పందించిన సింఘ్వీ, తన క్లయింట్ మీనాక్షి నటరాజన్పై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని వివరించారు. కోర్టు ఇంకా సదరు కేసును విచారణకు కూడా స్వీకరించలేదని, అది కేవలం ప్రాథమిక విచారణ నోటీసు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఏదైనా కేసులో కోర్టు చార్జిషీట్ దాఖలు చేసి, కనీసం రెండేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల కింద అభియోగాలు నమోదైతేనే అఫిడవిట్లో పేర్కొనాల్సి ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Jaishankar Russia Oil | మీరు అమ్మే ఆయుధాలతోనే భారత్పై దాడి: యూరప్ను నిలదీసిన జైశంకర్
