అక్షరటుడే, వెబ్డెస్క్ : NEET Re Exam Scam | నీట్ రీ ఎగ్జామ్లో మరో భారీ స్కాం బయట పడింది. పరీక్షలకు మోసాలకు పాల్పడేందుకు యత్నించిన 30 మందిని బీహార్ పోలీసులు (Bihar Police) అరెస్ట్ చేశారు.
బీహార్లోని పలు పరీక్షా కేంద్రాలలో ఇంపర్సోనేషన్ (వేరొకరి స్థానంలో పరీక్ష రాయడం), మోసాలకు సంబంధించిన ఘటనలు వెలుగు చూశాయి. నీట్ యూజీ పునఃపరీక్ష (re-examination) సందర్భంగా జిల్లా యంత్రాంగం, పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తనిఖీల సమయంలో మొత్తం 30 మందిని అరెస్టు చేశారు. వీరిలో అసలు అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది కూడా ఉన్నారు.
NEET Re Exam Scam | విచారణ ముమ్మరం
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లఖిసరాయ్లోని వివిధ పరీక్షా కేంద్రాలలో ఈ చర్యలు చేపట్టారు. KRK హై స్కూల్ పరీక్షా కేంద్రం నుంచి ఒకరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు, హసన్పూర్ స్కూల్ పరీక్షా కేంద్రం నుంచి ఒకరు నకిలీ అభ్యర్థులు పట్టుబడ్డారు. అరెస్టు అయిన వ్యక్తులు వివిధ జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది. ఈ తొమ్మిది మంది నకిలీ అభ్యర్థులతో పాటు, పరీక్షా మోసానికి సంబంధించి మరో 21 మందిని కూడా అరెస్టు చేశారు. ఈ నెట్వర్క్లో వారి పాత్రపై అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ నెట్వర్క్లో మరికొంత మంది ప్రమేయం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: CM Vijay Temple Funds | ఆలయ నిధులు ఇకపై మతపరమైన అవసరాలకే : డీఎంకే ప్రాజెక్టులపై సీఎం విజయ్ ‘సర్జికల్ స్ట్రైక్’!