Japan PM India Visit | జపాన్​ ప్రధానికి మోదీ ఘన స్వాగతం

జపాన్ ప్రధాని సనాయే తకైచికి గురువారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఘన స్వాగతం లభించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Japan PM India Visit | జపాన్ ప్రధాని సనాయే తకైచికి గురువారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో లాంఛనప్రాయ స్వాగతం లభించింది. ఆమె రాక సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) జపాన్ ప్రధానికి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

తకైచి, ప్రధాని మోదీ తమ తమ దేశాల మంత్రులకు, ప్రతినిధి బృందాలకు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. తకైచి మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్​కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.

Japan PM India Visit | కీలక చర్చలు

Japan PM India Visit

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ జపాన్ ప్రధానికి బుధవారం స్వాగతం పలికారు. న్యూఢిల్లీ, టోక్యోల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ క్రమంలో గురువారం ఆమె రాష్ట్రపతి భవన్​ను సందర్శించారు. తకైచి పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఆర్థిక భద్రత, పటిష్టమైన సరఫరా గొలుసులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, రక్షణ, సముద్ర భద్రత మరియు పెట్టుబడుల రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే అంశాలపై చర్చించనున్నారు. ద్వైపాక్షిక చర్చల కోసం ప్రధాని మోదీ, జపాన్​ పీఎం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు చేరుకున్నారు.

ఇది కూడా చదవండి..: India Japan Partnership | భారత్​కు చేరుకున్న జపాన్​ ప్రధాని.. స్వాగతం పలికిన ప్రధాని మోడీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *