అక్షరటుడే వెబ్డెస్క్: Bengaluru Quarry Accident | కర్ణాటక రాజధాని బెంగళూరు ( bengaluru ) నగర శివార్లలో ఒక ప్రైవేట్ రాతి క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ఏడుగురు కార్మికుల ప్రాణాలను బలిగొంది. క్వారీలో పనులు జరుగుతుండగా, పై భాగం నుంచి భారీ బండరాయి విరిగి కార్మికులపై పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
Bengaluru Quarry Accident | పెద్ద శబ్దంతో విరిగిన బండరాయి ..
క్వారీలో కూలీలు పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బండరాయి విరిగిపడింది. ఈ ఊహించని ప్రమాదంలో ఏడుగురు కార్మికులు బండరాళ్ల కింద చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ప్రధానంగా ఉత్తర కర్ణాటక , ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు.
Bengaluru Quarry Accident | సహాయక చర్యలు ముమ్మరం..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది, విపత్తు నిర్వహణ (NDRF/SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భారీ క్రేన్ల సాయంతో బండరాళ్లను తొలగిస్తూ, శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు.
Bengaluru Quarry Accident | నిర్లక్ష్యంపై ఆగ్రహం..
క్వారీలో పనిచేసే కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం కనీస నిబంధనలు పాటించలేదని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Japan PM India Visit | జపాన్ ప్రధానికి మోదీ ఘన స్వాగతం