అక్షరటుడే వెబ్డెస్క్: Madhya Pradesh Waqf Board | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh ) ప్రభుత్వం వక్ఫ్ బోర్డు నిర్వహణలో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం ముస్లిం ప్రతినిధులు మాత్రమే ఉండే ఈ బోర్డులోకి, ప్రభుత్వం ఇప్పుడు హిందూ సభ్యులను కూడా నియమించింది. ఈ నిర్ణయం ద్వారా బోర్డు పనితీరులో మరింత పారదర్శకతను తీసుకురావాలని సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Madhya Pradesh Waqf Board | ముస్లిమేతర సభ్యులకు స్థానం ..
వక్ఫ్ బోర్డు నిర్వహణను మెరుగుపరచడం, ఆస్తుల వివరాలను పక్కాగా నమోదు చేయడం , చట్టపరమైన వ్యవహారాల్లో పారదర్శకతను పెంచడం కోసం ఈ మార్పులు చేసినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, వక్ఫ్ బోర్డులో న్యాయ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల కోటాలో ముస్లిమేతర సభ్యులకు స్థానం కల్పించారు.
Madhya Pradesh Waqf Board | ప్రభుత్వ ప్రతినిధుల కోటాలో..
ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సబ్-రిజిస్ట్రార్ స్థాయి అధికారి సజీవ్ శ్రీవాస్తవతో పాటు, మరికొందరు ముస్లిమేతర సభ్యులను బోర్డులోకి తీసుకున్నారు. న్యాయ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధుల కోటాలో వీరి నియామకం జరిగింది.
Madhya Pradesh Waqf Board | రాజకీయాల్లో హాట్ టాపిక్..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వేళ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక మతపరమైన సంస్థ నిర్వహణలో మరొక మతానికి చెందిన వ్యక్తులను చేర్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇది కేవలం పాలనాపరమైన సంస్కరణలో భాగమేనని స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలో కోట్ల అవినీతి : మంత్రి పొన్నం