Siro Pharma Plant | ఫార్మా రంగంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం, బయోటెక్ పార్క్ ఫేజ్-IIIలో సిరో ఫార్మా సంస్థ నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Siro Pharma Plant | సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం, బయోటెక్ పార్క్ ఫేజ్-IIIలో సిరో ఫార్మా సంస్థ నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ( జులై 6 ) ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఫార్మా రంగంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని, ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.

Siro Pharma Plant | అత్యాధునిక సాంకేతికతతో ఉత్పత్తి

ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు అక్కడ ఉన్న పరిశోధన, ఉత్పత్తి విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తయారీలో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతికత, నాణ్యతా ప్రమాణాల గురించి సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు అధునాతన ఔషధాలను ఇక్కడే తయారు చేయడం వైద్య రంగానికి పెద్ద ఊరటని మంత్రులు అభిప్రాయపడ్డారు.

ciro

Siro Pharma Plant | దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఫార్మా

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఫార్మా రంగంలో తెలంగాణ ( Telangana )  దేశానికే దిక్సూచిగా మారిందని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి ఔషధ పరిశోధన, తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఈ కీర్తిని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి కావాల్సిన అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని భరోసా ఇచ్చారు.

Siro Pharma Plant | ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి..

పరిశ్రమల స్థాపన వల్ల కేవలం ఔషధ తయారీ మాత్రమే కాకుండా, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సిరో ఫార్మా వంటి సంస్థలు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఉపాధ్యక్షులు మల్లేష్ గౌడ్, స్థానిక సర్పంచ్ కవిత నర్సింలు, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సిరో ఫార్మా చైర్మన్ గోవిందా రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Ayodhya Ram Mandir | అయోధ్య ట్రస్ట్‌ వివాదం.. ఇద్దరు కీలక నేతల రాజీనామాలు ఆమోదం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *