అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Manufacturing Investment | ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తయారీ పరిశ్రమలను స్థాపించడానికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రం అని మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu) అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జర్మన్ ప్రతినిధి బృందాన్ని కోరారు.
పెట్టుబడిదారులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో తెలంగాణను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. బవేరియన్ ఆర్థిక వ్యవహారాలు, ప్రాంతీయ అభివృద్ధి, ఇంధన శాఖ ఉప మంత్రి టోబియాస్ గోథార్డ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి జర్మన్ ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది.
Telangana Manufacturing Investment | పారిశ్రామిక అభివృద్ధి
తెలంగాణ, జర్మనీల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. జీవశాస్త్రాలు, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, రక్షణ, అధునాతన తయారీ, ప్రెసిషన్ ఇంజనీరింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, సెమీకండక్టర్లు, ఆటోమోటివ్, మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ హెల్త్, పరిశోధన, ఆవిష్కరణ, స్వచ్ఛ ఇంధనం, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీలు), ఇండస్ట్రీ 4.0 వంటి రంగాలలో తెలంగాణ విస్తారమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తోందని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి..: Etela Rajender | కాళేశ్వరంపై కాంగ్రెస్ వాదన దుర్మార్గం: ఈటల రాజేందర్