అక్షరటుడే, వెబ్డెస్క్: Cyberabad CI Transfers | సైబరాబాద్ (Cyberabad) కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐలు బదిలీ అయ్యారు. మొత్తం 55 మంది సీఐలను ట్రాన్స్ఫర్ చేస్తూ సీపీ రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Cyberabad CI Transfers | బదిలీ అయిన సీఐలు
కూకట్పల్లి ఎస్హెచ్వోగా పని చేస్తున్న కేవీ సుబ్బారావు మాదాపూర్కు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో ఉన్న పి. రమేష్నుమాదాపూర్ డీఐగా ట్రాన్స్ఫర్ చేశారు. రాయదుర్గం ఎస్హెచ్వోగా టి భూపతి, కూకట్పల్లి ఎస్హెచ్వోగా డి. స్వామి గౌడ్ బదిలీపై వెళ్లనున్నారు. కూకట్పల్లి డీఐగా జి. శేఖర్ రెడ్డి, బాలానగర్ ఎస్హెచ్వోగా జి. ప్రశాంత్, మియాపూర్ ఎస్హెచ్వోగా ఎన్. జయరాం, మియాపూర్ డీఐగా డి. విజయ నాయక్, కేపీహెచ్బీ ఎస్హెచ్వోగా జి. విజయ్ కుమార్, కేపీహెచ్బీ డీఐగా బి. భూపాల్ బదిలీ అయ్యారు.

కొల్లూరు ట్రాఫిక్ ఎస్హెచ్వోగా వెంకట్ రెడ్డి, అల్లాపూర్ SHOగా ఎస్. నవీన్ కుమార్ గచ్చిబౌలి కె. సైదులు, నార్సింగి ఎస్హెచ్వోగా డి. విష్ణువర్ధన్ రెడ్డి, కొల్లూరు ఎస్హెచ్వోగా చి. సైది రెడ్డిని నియమిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. చందానగర్ ఎస్హెచ్వోగా ఏ.ఆర్.ఈ. శ్రీధర్, చందానగర్ డీఐగా వి. జానయ్య, ఆర్సీ పురం ఎస్హెచ్వోగా జి. లాలు నాయక్, పటాన్చెరు ఎస్హెచ్వోగాగా ఎం. రవీందర్ బదిలీ అయ్యారు. ఇలా మొత్తం 55 మందిని ట్రాన్స్ఫర్ చేశారు.
ఇది కూడా చదవండి..: Kalma Homework Controversy | ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. కఠిన చర్యలు తీసుకోవాలన్న వీహెచ్