అక్షరటుడే, వెబ్డెస్క్ : CJP Protest Ends | ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తన నిరసనను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉన్న తమ మద్దతుదారులను ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేసిన తర్వాత.. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. సుమారు 3 గంటల పాటు చర్చల అనంతరం ప్రభుత్వం, CJP సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. కేంద్ర మంత్రులు జె.పి. నడ్డా, జితేంద్ర సింగ్ల సమక్షంలో మాట్లాడిన CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందనే “సద్భావనతో” నిరసనను విరమిస్తున్నట్లు తెలిపారు.
CJP Protest Ends | విద్యార్థుల కుటుంబాలకు పరిహారం
తమ డిమాండ్లలో ఒకటి ఇప్పటికే నెరవేరిందని వారు తెలిపారు. విద్యార్థులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోమని, పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం గరిష్ట పరిహారం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.
CJP Protest Ends | ఇళ్లకు వెళ్లాలి
ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించినందున నిరసనకారులందరూ ఇళ్లకు వెళ్లాలని సౌరవ్ దాసు కోరారు. అశుతోష్ రంకా మాట్లాడుతూ, 36 రోజుల నిరసన తర్వాత ప్రభుత్వం డిమాండ్లన్నింటినీ అంగీకరించిందన్నారు. నిరసన ప్రదేశాల నుండి శాంతియుతంగా వైదొలగాలని ఆయన కోరారు.
#WATCH | Delhi: After talks with the government, Cockroach Janta Party’s National Spokesperson Ashutosh Ranka says, “All our demands have been accepted, so we request the protesters to withdraw immediately and return home peacefully. We will inform you of our future strategy or… pic.twitter.com/z03j5c9lD8
— ANI (@ANI) July 25, 2026
దీనిని కూడా చదవండి : Krishna River Flood | కృష్ణా నదికి వరద.. రైతుల్లో ఆశలు