అక్షరటుడే, వెబ్డెస్క్ : Kukatpally Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సెలవు కావడంతో స్నేహితులతో క్రికెట్ ఆడటానికి బైక్పై బయలు దేరిన మైనర్లను లారీ ఢీకొంది.
సరదాగా క్రికెట్ ఆడేందుకు ముగ్గురు స్నేహితులు ఆదివారం తెల్లవారుజామున బయలు దేరారు. వారిని టిప్పర్ లారీ ఢీకొంది. దీంతో మహేశ్ (17), లక్ష్మీ తేజ్ (17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడికి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Kukatpally Accident | డ్రైవర్ అరెస్ట్..
ప్రమాదానికి కారణం అయిన లారీ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా.. లేక లారీ డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా బైక్పై వెళ్తున్న ముగ్గురు మైనర్లు కావడం గమనార్హం.
దీనిని కూడా చదవండి : July 26 Gold Prices | తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి!