అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan Mine Blast | పాకిస్తాన్ (Pakistan)లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో గురువారం ఒక బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ శక్తివంతమైన పేలుడులో కనీసం 32 మంది గని కార్మికులు మరణించారు. మరో 10 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. సహాయక బృందాలు గని లోపల రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. ప్రాణాలతో ఉన్నవారిని కనుగొనే అవకాశాలు వేగంగా తగ్గిపోతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.
Pakistan Mine Blast | క్వెట్టా శివారులోని గనిలో పేలుడు
బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన క్వెట్టా శివారులో గల గనిలో పేలుడు సంభవించింది. ప్రభుత్వ గని ఇన్స్పెక్టర్ ఘనీ బలూచ్ తెలిపిన వివరాల ప్రకారం.. గని లోపల మిథేన్ వాయువు పేరుకుపోవడం వల్లే ఈ పేలుడు సంభవించిందని అనుమానిస్తున్నారు.
Pakistan Mine Blast | కొనసాగుతున్న సహాయక చర్యలు
పేలుడు సంభవించిన అనంతరం అత్యవసర బృందాలు సంఘటనా స్థలం నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశాయి. సహాయక చర్యలు చేపట్టగా మరో 25 మృతదేహాలను గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 32కు చేరింది. మరో 10 మంది కార్మికులు భూగర్భంలోనే చిక్కుకుపోయారని, వారిని చేరుకునేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.
Pakistan Mine Blast | పేలుడుపై విచారణకు ఆదేశం
పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించడానికి అధికారులు సమగ్ర విచారణ జరపున్నట్లు అక్కడి మంత్రి తెలిపారు. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి, లోపాలను గుర్తించి భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మైనింగ్ భద్రతా నిబంధనలను సమీక్షిస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి..: US Airstrikes Iran | ఇరాన్పై అమెరికా భారీ దాడులు