అక్షరటుడే, వెబ్డెస్క్ : Nepal Floods | ఆకస్మిక వరదలతో అల్లకల్లోలం అయిన నేపాల్ ఇంకా తేరుకోలేదు. ఇరదల్లో ఇప్పటికే 1300 మందికి పైగా మృతి చెందారు. మరో 5 వేల మందికి పైగా గల్లంతు అయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 275 మంది భారతీయుల ఆచూకీ లభించలేదు.
నేపాల్లో ఇటీవల ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. త్రిశూర్ జిల్లాలో వరదల ధాటికి పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. జల విద్యుత్ కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. దీంతో నేపాల్లోని చాలా గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. దీంతో అధికారులు విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. రసువాలోని బెట్రావతిలో విద్యుత్ను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Nepal Floods | విద్యుత్ పునరుద్ధరణ
బెట్రావతిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కొనసాగుతోంది, దీనివల్ల ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ఇతర నిత్యావసర సేవలకు అంతరాయం కలుగుతోంది. వీలైనంత త్వరగా కనెక్టివిటీని పునరుద్ధరించడానికి స్థానిక పరిపాలన మరియు విద్యుత్ కార్మికులు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం నుంచి దెబ్బతిన్న ట్రాన్స్మిషన్ లైన్లకు మరమ్మతులు చేయడం, ఇతర మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడం వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల్లో స్థానిక గ్రామస్థులు కూడా పాల్గొంటున్నారు.
#WATCH | Nepal: Days after the devastating flash floods that left more than 1300 dead, efforts to restore electricity are underway in Betrawati, Rasuwa.
Power supply in Betrawati remains disrupted, affecting houses, schools, hospitals and other essential services. The local… pic.twitter.com/mHx9yBB5h9
— ANI (@ANI) September 5, 2026
దీనిని కూడా చదవండి : Bike Accident in Dichpally | అదుపు తప్పిన బైక్.. ఇద్దరు యువకుల మృతి