Private Employees Union | ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజగోపాల్ యాదవ్

Balla Sandeep Kumar

అక్షరటుడే, పఠాన్​చెరు : Private Employees Union | తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పటాన్​చెరు పట్టణానికి చెందిన రాజగోపాల్ యాదవ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ డాక్టర్​ జనక్ ప్రసాద్ నియామక పత్రం అందజేశారు.

Private Employees Union | కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

ఈ సందర్భంగా రాజ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల హక్కుల సాధన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్​ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ.. కార్మికులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి బోర్డు మెంబర్ రాజు ముదిరాజ్, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Janak prasad

ఇది కూడా చదవండి..: Prajavani grievance | ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి.. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *