అక్షరటుడే, పఠాన్చెరు : Private Employees Union | తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పటాన్చెరు పట్టణానికి చెందిన రాజగోపాల్ యాదవ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ డాక్టర్ జనక్ ప్రసాద్ నియామక పత్రం అందజేశారు.
Private Employees Union | కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
ఈ సందర్భంగా రాజ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల హక్కుల సాధన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ.. కార్మికులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి బోర్డు మెంబర్ రాజు ముదిరాజ్, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Prajavani grievance | ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

