అక్షరటుడే, ఇందూరు: Har Ghar Tiranga | ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని అర్బన్ (Nizamabad) ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ( MLA Dhanpal Suryanarayana) సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని బస్టాండ్ వద్ద త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు.
Har Ghar Tiranga | స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రతి సంవత్సరం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం స్వాతంత్ర దినోత్సవం ఒక్కరోజు జెండా ఎగురవేయడమే కాకుండా ఇంటిపై నిత్యం రెపరెపలాడాలన్నారు. అలాగే ఈనెల 14న జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, ఫ్లోర్లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Jharkhand Student Protest | జార్ఖండ్లో విద్యార్థులపై లాఠీఛార్జ్ తప్పు : రాహుల్ గాంధీ