Mission Bhagiratha Pipeline | మిషన్ భగీరథ పైప్​లైన్​కు లీకేజీ.. నీటి సరఫరాకు అంతరాయం

బాన్సువాడ పట్టణంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Mission Bhagiratha Pipeline | బాన్సువాడ (Banswada) పట్టణంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. దీంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది.

Mission Bhagiratha Pipeline | మూడురోజుల పాటు..

భగీరథ పైప్​లైన్​కు లీకేజీ ఏర్పడడంతో తాగునీటి సరఫరాను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. పైపులైన్ మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు తాగునీటి అవసరాల కోసం స్థానికంగా ఉన్న మున్సిపాలిటీ బోర్లను వినియోగించుకోవాలని సూచించారు. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే యథావిధిగా మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరాను పునరుద్ధరిస్తామని కమిషనర్ వెల్లడించారు. ప్రజలు సహకరించి, నీటిని పొదుపుగా వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Mission Bhagiratha Pipeline

ఇది కూడా చదవండి..: Bheemgal Car Accident | భీమ్‌గల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్​కు తృటిలో తప్పిన ప్రమాదం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *