అక్షరటుడే, బాన్సువాడ: Electric Shock | విద్యాదాఘాతంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బీర్కూర్ మండలం (Beerkur Mandal)లో గురువారం చోటు చేసుకుంది.
Electric Shock | బీర్కూరు మండలం కిష్టాపూర్..
బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన యువకుడు మహేష్(26) అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో విద్యుత్ సంబంధిత సమస్య ఉండడంతో దానిని స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే మహేష్ను బాన్సువాడ ఏరియా ఆసుపత్రి (Banswada Area Hospital)కి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Common School | రాష్ట్రంలో కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలి..: టీపీటీఎఫ్ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్

