అక్షరటుడే, మెండోరా : KTR Grand Welcome | ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోచంపాడ్ ఎక్స్రోడ్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ప్రార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు.
KTR Grand Welcome | తరలివచ్చిన కార్యకర్తలు..
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వాగత కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ జెండాలతో, నినాదాలతో నాయకులు కేటీఆర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ముచ్చటించిన కేటీఆర్ స్థానిక హోటల్లో టీ తాగారు. అనంతరం ఆయన ఆదిలాబాద్ వెళ్లారు.
ఇది కూడా చదవండి..: Education Department | సర్కారు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం.. అడ్మిషన్ రిజిస్టర్ మాయం..