Drunk Driving | తగ్గని మందుబాబులు.. రెండు వారాల్లో 426 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ మందుబాబులు ఏమాత్రం తగ్గట్లేదు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drunk Driving | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ ​(Nizamabad Police Commissionerate) పరిధిలో పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ మందుబాబులు ఏమాత్రం తగ్గట్లేదు. వారం రోజుల్లో ఏకంగా 426కేసులు నమోదయ్యాయంటే ఏస్థాయిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారో తెలుస్తోంది.

Drunk Driving | రెండువారాల్లో 426 కేసులు..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్​ ట్రాఫిక్​, బోధన్(Bodhan)​, ఆర్మూర్(Armoor)​ పరిధిలో గడిచిన రెండు వారాల్లో పోలీసులు డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 426 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్​, బోధన్, అర్మూర్ కోర్టుల్లో ప్రవేశపెట్టారు. ఇందులో 10 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా.. మిగిలిన వారికీ రూ.41,60,000 జరిమానా విధించినట్లు సీపీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: క్రికెట్ ఆడిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *