అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Prajavani Complaints | ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ (Additional Collector Dileep Kumar) అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు తరలివచ్చారు.
Prajavani Complaints | పెండింగ్లో ఉంచవద్దు..
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆయనతో పాటు సబ్ కలెక్టర్లు వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato), అభిగ్యాన్ మాల్వియా, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, ఆర్డీవో రాజేంద్ర కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లు వినతులు స్వీకరించారు. కాగా..ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Women Reservation | మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి

