అక్షరటుడే,నిజామాబాద్ క్రైం: Eagle Force | నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా (Nizamabad) గంజాయి సరఫరాపై ఈగల్ ఫోర్స్ (Eagle Force nizamabad) ఉక్కుపాదం మోపుతోంది. ఏడాది కాలం (2025–26) కాలంలో 7 టన్నుల వరకు గంజాయిని స్వాధీనం చేసుకుంది.
Eagle Force | పక్క సమాచారంతో దాడులు..
ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. గంజాయి సరఫరాను నిలువరించేందుకు ఈగల్ ఫోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటైందన్నారు. 2025 నుంచి 2026 వరకు నార్కోటిక్స్ పోలీసులు 165 మంది డ్రగ్ గంజాయి వాడుతున్న వ్యక్తులను పట్టుకుని ఆయా పోలీస్ స్టేషన్లలో అప్పగించారన్నారు.
వారిని డీ అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరిగిందన్నారు. అలాగే నార్కోటిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 492 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
యాంటీ ట్రాక్ సోల్జర్గా..
కల్తీ కల్లు సంబంధించి 192 కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా మునావర్ అలీ, షేక్ అలీమా, గంధం శ్రీనివాస్ గౌడ్, మల్లెపూల లక్ష్మణ్ గౌడ్లపై ఎన్డీపీఎస్ యాక్ట్ అమలు చేసేందుకు పత్రాలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ప్రజలందరూ యాంటీ ట్రాక్ సోల్జర్గా పనిచేస్తూ ఎక్కడైనా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1908 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ జిల్లా అధికారి సోమనాదం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: #KJQ Trailer Out Now