Basaveshwara Jayanthi | బసవేశ్వర భవన్​కు శంకుస్థాపన చేస్తాం : మంత్రి పొన్నం

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Basaveshwara Jayanthi | తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వరుడి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​, వాకిటి శ్రీహరి హాజరయ్యారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక న్యాయం, నైతిక జీవన విలువలను బోధించిన వ్యక్తి బసవేశ్వరుడన్నారు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలని, ఆచరించాలన్నారు. బసవేశ్వరుని గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని, త్వరలోనే ‘బసవేశ్వర భవన్’కు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.

Basaveshwara Jayanthi | కుల వివక్ష నిర్మూలనకు..

రాహుల్ గాంధీ (Rahul Gandhi) బసవేశ్వరుడి స్ఫూర్తితోనే భారత్ జోడో యాత్ర చేపట్టారని పొన్నం పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు బసవేశ్వరుని తత్వం గురించి తెలియజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. బసవేశ్వరుడు కుల వివక్ష నిర్మూలనకు కృషి చేశారని, మానవులందరూ సమానమే అనే సూత్రాన్ని వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. స్త్రీలకు సమాన హక్కులను సమర్థించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Harish Rao Delhi Tour | బీఆర్​ఎస్​లో ముసలం.. కాంగ్రెస్​ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *