అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoist surrender | తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో 47 మంది మావోయిస్టుల లొంగిపోయారు. వారిలో పలువురు కీలక నేతలు ఉన్నారు.
హైదరాబాద్ (Hyderabad)లో తెలంగాణ పోలీసుల సమక్షంలో LMG, AK-47, SLR, INSAS రైఫిల్స్తో సహా 32 ఆయుధాలతో 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో DKSZC సభ్యుడు, దక్షిణ బస్తర్ DVC ఇన్చార్జి హేమ్లా ఐతు అలియాస్ విజ, దక్షిణ బస్తర్ DVCకి చెందిన 9వ ప్లాటూన్ కమాండర్ పోడియం లాచు అలియాస్ మనోజ్ ఉన్నారు. మొత్తం 47 మంది మావోయిస్టులు శనివారం సరెండర్ అయ్యారు. తెలంగాణ లొంగుబాటు, పునరావాస విధానం పట్ల ఆకర్షితులై మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.
Maoist surrender | ఖాళీ అవుతున్న బస్తర్
మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులందరూ లొంగిపోయిన నేపథ్యంలో DKSZC పరిధిలోని దక్షిణ బస్తర్ (Bastar)లో పార్టీ ఉనికి దాదాపుగా కనుమరుగు అయింది. దీంతో దక్షిణ బస్తర్ DVC ఇప్పుడు పూర్తిగా కుప్పకూలే దశకు చేరుకుందని పోలీసులు తెలిపారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. అనేక మంది ఎన్కౌంటర్లలో చనిపోగా.. ఇటీవల పార్టీ సెక్రెటర్ దేవ్జీ సహా కీలక నేతలు లొంగిపోయారు. దీంతో మిగతా వారు సైతం అడవులను వీడుతున్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీ దాదాపుగా కనుమరుగు అయింది. అయితే అక్కడక్కడ మిగిలిపోయిన వారు సైతం తాజాగా లొంగిపోతున్నారు.

దీనిని కూడా చదవండి: Raghav Chadha | అవినీతిపరుల చేతుల్లో ‘ఆప్’.. అందుకే బయటకు వచ్చాం: రాఘవ్ చడ్డా

