అక్షరటుడే, వెబ్డెస్క్ : Rahul Gandhi remarks | దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నారని, ఆ క్రమంలో దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. హుగ్లీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
Rahul Gandhi remarks | బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ద్వేషం
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను కేవలం రాజకీయ పోరాటంగా చూడవద్దని, ఇది రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధమని రాహుల్ పేర్కొన్నారు. ఒకవైపు కాంగ్రెస్ నమ్ముతున్న ఐక్యత, సోదరభావం ఉంటే.. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్ (RSS)ల ద్వేషం, హింసాత్మక ధోరణి ఉన్నాయని ఆయన ఆరోపించారు.
Rahul Gandhi remarks | దేశాన్ని అమ్ముతున్నారు
ప్రధాని మోదీ తనను తాను దేశభక్తుడిగా చెప్పుకుంటూనే, మరోవైపు దేశాన్ని ధనికులకు అమ్ముకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. “మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజల మధ్య భయాన్ని, విద్వేషాన్ని పెంచుతారు. బీజేపీ పేదల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. సామాన్యుల కోసం కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కూడా అస్తవ్యస్తం చేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rahul Gandhi remarks | బెంగాల్ పరిస్థితిపై ధ్వజం
మమతా బెనర్జీ (Mamata Banerjee) తన చర్యలతో బెంగాల్ను భ్రష్టు పట్టిస్తున్నారని రాహుల్ విమర్శించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు లోబడి ఉండాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సామాన్యుల అభివృద్ధి కంటే ధనికుల లబ్ధి కోసమే ప్రస్తుత పాలకులు పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
“Mamata helping rich, not poor in Bengal, Modi doing the same across country.”
– LS LoP Rahul Gandhi at Hooghly rally pic.twitter.com/zSBgC74kOh
— News Arena India (@NewsArenaIndia) April 25, 2026
దీనిని కూడా చదవండి : AI Toll System | టోల్ గేట్ల దగ్గర ఆగకుండానే టోల్ కట్.. కేంద్రం సరికొత్త ‘ఏఐ’ ప్లాన్!

