అక్షరటుడే, వెబ్డెస్క్ : Waqf Board Inspector Bribe | అవినీతి అధికారులు మారడం లేదు. లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) జరగుతున్నా.. భయపడటం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు.
మసీదు ఆస్తి రిజిస్ట్రేషన్కు సంబంధించి రూ.10,000 లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ను ఏసీబీ హ్యాండెడ్గా పట్టుకుంది. షేక్ మహమూద్ నల్గొండ జిల్లా (Nalgonda District) వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. వక్ఫ్ బోర్డు రికార్డులలో జామే మసీదు అబూబకర్ సిద్ధిక్ రహమతుల్లా అలై పెద్దావూర ఆస్తిని నమోదు చేయడానికి సంబంధించి ఫిర్యాదిదారు ఫిబ్రవరి 25న వినతి పత్రం ఇచ్చారు. దీనిని పరిశీలించి హైదరాబాద్ వక్ఫ్ బోర్డు సీఈవోకు నివేదికను సమర్పించడం కోసం ఇన్స్పెక్టర్ మహమూద్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు.
Waqf Board Inspector Bribe | కార్యాలయంలో సోదాలు
బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి శనివారం లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు (ACB Officers) వలపన్ని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి కార్యాలయంలో సోదాలు చేశారు. నాంపల్లిలోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Kavitha Remarks | రాష్ట్రంలో కేటీఆర్ పాలన నడుస్తోంది.. కవిత సంచలన వ్యాఖ్యలు
