అక్షరటుడే, కామారెడ్డి: Paddy Procurement Kamareddy | నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భిక్కనూర్(Bhikkanoor) తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.
Paddy Procurement Kamareddy | భిక్కనూరు తహశీల్దార్ కార్యాలయంలో..
తాజాగా భిక్కనూర్ తహశీల్దార్ కార్యాలయంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్తో వాగ్వాదానికి దిగారు. లారీలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి. ఏ కేంద్రంలో పూర్తిస్థాయిలో ధాన్యం(Paddy Procurement) తరలించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ రైతులకు నచ్చజెప్పినా వినకపోవడంతో అడిషనల్ కలెక్టర్తో(Additional Collector) ఫోన్లో మాట్లాడారు. రైతుల ధాన్యం 48 గంటల్లో తరలించే ఏర్పాట్లు చేస్తామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు.

ఇది కూడా చదవండి: Nizamabad Medical College | మెడికల్ కళాశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. కలకలం రేపిన ఘటన
