అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy Procurement Centers | ‘లారీలు రావు.. ధాన్యం పోదు’ శీర్షికతో మంగళవారం ‘అక్షర టుడే’లో (Akshara today) ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ధాన్యం(paddy procurement) తరలించేందుకు తగినన్ని లారీలను ఏర్పాటు చేస్తామని లింగంపేట్(Lingampet) తహశీల్దార్ సురేష్, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు నర్సింలు హామీ ఇచ్చారు. బుధవారం వారు సంయుక్తంగా మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.
Paddy Procurement Centers | కల్లాల వద్దకు వెళ్లి.. రైతులతో మాట్లాడి..
కల్లాల (Paddy Procurement) వద్దకు నేరుగా వెళ్లి రైతులతో మాట్లాడిన అధికారులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను (grain transportation) వెంటనే గోదాములకు తరలించేందుకు లారీలను పంపిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. రవాణా, హమాలీ ఛార్జీల పేరుతో రైతుల నుండి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను తహశీల్దార్ సురేష్ హెచ్చరించారు. ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, తూకంలో తేడాలు రాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని సైతం నిబంధన ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad Child Murder | రెండో పెళ్లికి అడ్డని.. ఆరేళ్ల చిన్నారిని కడతేర్చిన కసాయి తల్లి


