అక్షరటుడే, లింగంపేట: Paddy Procurement Delay | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవాలంటే రైతన్నలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్లు చేసినప్పటికీ రైస్మిల్లులకు తరలించడంలో జాప్యాన్ని నిరసిస్తూ కేకేవై రహదారిపై రైతులు ఆందోళన చశారు.
Paddy Procurement Delay | లింగంపేట మండలంలోని రైతులు..
ఈ సందర్భంగా లింగంపేట మండలం (Lingampet Mandal)లోని భవానీ పేట, జల్దిపల్లి, రాంపూర్ గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ.. కొనుగోళ్లు పూర్తయినప్పటికీ ధాన్యం ఇంకా కేంద్రాల్లోనే పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీపేట గ్రామంలో కేంద్రం ప్రారంభించి సుమారు నెలరోజులు పూర్తయి కొంత ధాన్యం కొనుగోళ్లు జరిగినప్పటికీ 100కు పైగా ధాన్యం రాశులు అలాగే ఉండిపోయాయన్నారు. లారీలు రాకపోవడం తూకాలు సరిగ్గా జరగకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Paddy Procurement Delay | మూడు రోజులకు ఒక లారీ..
గ్రామానికి మూడు రోజులకు ఒక లారీ వస్తుందని దానిలో 400 బస్తాలు నుంచి 500 బస్తాలు మాత్రమే వెళ్తున్నాయన్నారు. మిగిలిన ధాన్యం బస్తాలు కేంద్రంలోనే మగ్గుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. నెలల తరబడి కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించేందుకు రైతన్నలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని వారన్నారు.
Paddy Procurement Delay | ముంచుకొస్తున్న కాలం..
ఒకపక్క ధాన్యం కొనుగోలు జరగకపోవడం.. మరో పది రోజులు గడిస్తే వర్షాకాలం సీజన్ ప్రారంభం కానుండడంతో తమ గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని రైతులంటున్నారు. ధాన్యం ఎప్పుడు అమ్ముకోవాలని.. తిరిగి సాగుకు ఎప్పుడు సన్నద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఘటనాస్థలానికి ఎస్సై దీపక్ కుమార్, ఆర్ఐ చేరుకొని రైతులను సముదాయించారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement Promises | రైతులకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది.: డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి


