అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy police | ప్రేమించిన యువతి సోదరులు దాడి చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Kamareddy police | పట్టణంలోని ఎస్సీ కాలనీలో..
పోలీసులు (Kamareddy city) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ధ్రువ కుమార్(19) అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి సోదరులకు తెలిసింది. దీంతో ధ్రువకుమార్ను వారు దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. దాంతో మనస్తాపానికి గురైన ధ్రువకుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.



