Kamareddy police | ప్రేమించిన అమ్మాయి సోదరుల దాడి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy police | ప్రేమించిన యువతి సోదరులు దాడి చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) పట్టణంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Kamareddy police | పట్టణంలోని ఎస్సీ కాలనీలో..

పోలీసులు (Kamareddy city) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ధ్రువ కుమార్​(19) అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి సోదరులకు తెలిసింది. దీంతో ధ్రువకుమార్​ను వారు దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. దాంతో మనస్తాపానికి గురైన ధ్రువకుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

police 6

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *