Kavitha Remarks | రాష్ట్రంలో కేటీఆర్​ పాలన నడుస్తోంది.. కవిత సంచలన వ్యాఖ్యలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Remarks | తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో అప్పుడు కేటీఆర్ పాలనే ఉంది. ఇప్పుడు కేటీఆర్ (KTR) పాలనే ఉందని కవిత అన్నారు. గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు అని పేర్కొన్నారు. ఇప్పుడు కేటీఆర్ పాలన అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని
విమర్శించారు. సీఎం సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. వాళ్ల భూ దందాలను వరుస బెట్టి ఆధారాలతో సహా బయటపెడతా అన్నారు. కాంగ్రెస్​కు ఇదే ఆఖరి సర్కార్ అని విమర్శించారు. 20 ఏళ్లు ఆ పార్టీని బొందపెట్టే పనులను రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు.

Kavitha Remarks | భూ దోపిడీ

బీఆర్ఎస్ ఉన్నప్పుడు భూ దోపిడికి కిటికీలు తెరిస్తే రేవంత్ రెడ్డి (Revanth Reddy) తలుపు తెరిచారని కవిత విమర్శించారు. ప్రాణం పోయినా సరే తెలంగాణలో ఇంచు భూమిని దోపిడీ చేయనివ్వనని పేర్కొన్నారు. గతంలో ఫినిక్స్ సంస్థకు బీఆర్ఎస్ 50 ఎకరాల వరకు ధారాధాత్తం చేస్తే ఇదే ముఖ్యమంత్రి అప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడారన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మరో వంద ఎకరాలు కలిసి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Kavitha Remarks | తెలంగాణ మా జాగీరే..

Kavitha Remarks

ఆంధ్రా విష కోరల్లోంచి తెలంగాణను సాధించుకున్నాం.. కచ్చితంగా తెలంగాణ మా జాగీరే అని కవిత అన్నారు. తెలంగాణ భూములను రక్షించేందుకు భూపోరాటాలు చేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా లీగల్ ఫైట్ చేస్తామన్నారు. అప్పులు పుట్టం లేదంటూ ఉన్న భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్ అవసరాలకు భూమి ఎట్ల అని ఆమె ప్రశ్నించారు. ఆదిత్య బిల్డర్స్​ వాళ్లు మూసీ గర్భంలో పెద్ద బిల్డింగ్ కడుతున్నారని కవిత ఆరోపించారు. ఆ సంస్థపై చర్యలు తీసుకునే దమ్ముందా.. అని హైడ్రాకు సవాల్​ చేశారు.

Kavitha Remarks | చెరువులో భూములు కొన్న పవన్

తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినకుండా బాధపడిన పవన్ కళ్యాణ్ ఆ బాధలో ఇక్కడ భూములు కొన్నారని ఎద్దేవా చేశారు.కానీ అది కోడికుంట అనే చెరువులో 10 ఎకరాల శిఖం భూమినే కొన్నారని ఆరోపించారు. ఇది శిఖం భూమియే అని ఇరిగేషన్ శాఖ నోటిఫై కూడా చేసిందన్నారు. కానీ రిజిస్ట్రేషన్​లో చాలా తప్పులు చేశారని ఆరోపించారు. వెంటనే ఆ భూమి రిటర్న్ ఇచ్చేయాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: ACB raids Kakinada | కాకినాడలో ఏసీబీ కలకలం: కోట్ల అక్రమాస్తులతో చిక్కిన రెవెన్యూ అధికారి శివరాం కుమార్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *