అక్షరటుడే, కోటగిరి : Dalit Tribal Journalists | రాష్ట్రంలోని దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణతో పాటు వారి అభివృద్ధి, సంక్షేమమే తమ సంకల్పమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న అన్నారు.
కోటగిరి మండల (Kotagiri Mandal) ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి కోటగిరి, మండలాల్లోని దళిత జర్నలిస్టులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేస్తూ, సమాజానికి మూల స్థంభమైన జర్నలిస్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్రిడిటేషన్ల విషయంలో న్యాయం చేయాలని కోరారు. చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అనే తేడా చూపకుండా ఆయా పత్రికలలో పని చేసే ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందించాలన్నారు. అదేవిదంగా హెల్త్ కార్డులు, జర్నలిస్టుల పిల్లల చదువులో పూర్తి శాతం రాయితీ కల్పించాలని కోరారు.
Dalit Tribal Journalists | ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
ప్రతీ జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో ఉన్న దళిత, గిరిజన జర్నలిస్టులను ఏకం చేసి జిల్లా ప్రథమ మహాసభను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బేగరి రాములు, రాము, భీంరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: State Finance Commission | స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ నియామకం
