అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Basara Godavari | బాసర(basara) గోదావరిలో విషాదం నెలకొంది. నదిలో స్నానాలకు దిగిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
Basara Godavari | పుణ్యస్నానాలకు వచ్చిన అన్నదమ్ములు..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్లోని(Hyderabad) కాచిగూడ(Kachiguda) చెప్పల్ బజార్కు చెందిన చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేష్కుమార్ (31)లు ముగ్గురు అన్నదమ్ములు. వీరు తమ కుటుంబాలతో బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ముందుగా పుణ్యస్నానాలు చేసేందుకు గోదావరిలో దిగారు. అయితే నీటిలోతు గమనించక వారు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనాస్థలానికి చేరుకుంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందం గల్లంతైన వారికోసం గాలిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Mohan Naik ACB Raid | ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. 100 కోట్ల పైచిలుకు ఆస్తులు?
