అక్షరటుడే, గాంధారి: Cattle Shed Fire | ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పు అంటుకోగా.. అగ్నికీలల్లో పశువులు విలవిలలాడాయి. ఈ ఘటనలో ఓ లేగదూడ మృతి చెందింది. కామారెడ్డి జిల్లా గాంధారి (Gandhari) మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Cattle Shed Fire | చద్మల్ తండాలో..
మండలంలోని చద్మల్తండాకు (Chadmal Thanda) చెందిన మాండు దేవిసింగ్ అనే రైతు తన నాలుగు ఆవులు, రెండు గేదెలు, రెండు ఎడ్లు ఒక దూడను, మరోరైతు ఇందల్ సింగ్కు చెందిన రెండు ఆవులను కలిపి తమ పొలం వద్ద ఉన్న గుడిసెలో కట్టేశారు. వాటికి మేత వేసి, నీళ్లు పెట్టి ఇంటికి వచ్చారు.
అయితే, ప్రమాదవశాత్తు కొట్టానికి నిప్పంటుకుంది. దీంతో కొట్టంలోని పశువులకు కూడా అగ్నికీలలు అంటుకున్నాయి. ఈ క్రమంలో ఓ లేగదూడ ఘటన స్థలంలోనే అసువులు బాసింది. మరికొన్ని పశువులకు కాలిన గాయాలయ్యాయి. ఫైరింజన్కు (Fire engine) సమాచారం ఇచ్చినప్పటికీ అది వచ్చేలోపే కొట్టం పూర్తిగా కాలిపోయింది. దాదాపు 11 మూగజీవాలకు నిప్పు అంటుకోగా.. లేగదూడ శుక్రవాం మృతి చెందింది. మిగతావి తీవ్రంగా గాయపడ్డాయి.
Cattle Shed Fire | సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై, పశు వైద్యసిబ్బంది
సంఘటన జరిగిన ప్రదేశానికి పశు వైద్య సిబ్బందితో పాటు ఎస్సై మహేందర్ చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఆరా తీశారు. మృతి చెందిన దూడకు పశువైద్యులు పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.లక్షల్లో నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని.. నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ తహశీల్దార్ రేణుక చవాన్కు వినతిపత్రం అందజేశారు.

ఇది కూడా చదవండి: Arunachalam Girivalam | అరుణాచలంలో చిత్ర పౌర్ణమి వేడుకలు.. గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఖరారు!

