నిజామాబాద్Common School | రాష్ట్రంలో కామన్​ స్కూల్​ విధానాన్ని అమలు చేయాలి : టీపీటీఎఫ్​​ అధ్యక్షుడు...

Common School | రాష్ట్రంలో కామన్​ స్కూల్​ విధానాన్ని అమలు చేయాలి : టీపీటీఎఫ్​​ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్​

రాష్ట్రంలో కామన్​ స్కూల్​ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీటీఎఫ్​ నిజామాబాద్​ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ అన్నారు.

అక్షరటుడే, ఇందూరు: Common School | రాష్ట్రంలో కామన్​ స్కూల్​ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీటీఎఫ్​ నిజామాబాద్​ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

వీటిపై చర్చించేందుకు తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో(TPTF) నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు నిజామాబాద్ సౌత్ మండల కేంద్రంలో కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు.

Common School | నాణ్యమైన విద్య..

ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని వెనిగళ్ల సురేష్​ అన్నారు. విద్యా హక్కుల సాధన కోసం సమగ్ర ఉద్యమాన్ని నిర్మించడమే టీపీటీఎఫ్​ లక్ష్యమని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏప్రిల్ 30న ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ‘సమరశీలతత్వాన్ని చాటుకుందాం.. విద్యా సమానత్వం సాధిద్దాం” అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందన్నారు. విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Common School | జాతీయ విద్యావిధానం.. సామాజిక న్యాయం..

రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ కె. నవీన్ నికోల ఐఏఎస్ హాజరుకానున్నారని.. గౌరవ అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారని సురేష్​ తెలిపారు. జాతీయ విద్యా విధానం, సామాజిక న్యాయంపై ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ (Telangana)లో విద్యా అసమానతలపై ప్రొఫెసర్ కాసిం, అంతర్జాతీయ రాజకీయాలపై ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ తదితరులు ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో టీపీటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు వెనిగర్ల సురేష్, ప్రధాన కార్యదర్శి పూదరి అర్వింద్, ప్రతినిధులు గోపి, సాయి, శ్రీహరి రావు, శ్రీలక్ష్మి, రామచంద్ర గైక్వాడ్, సునీత, రాములు, రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Pocharam Project | పోచారం ప్రాజెక్ట్​ భద్రతను పరిశీలించిన నిపుణుల బృందం..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....