అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | నాగిరెడ్డిపేట (Nagireddypeta) మండలంలో వందేళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్ట్ను సీడీఎస్ఈవో (CDSEO) బృందం గురువారం పరిశీలించింది. ఉదయమే ప్రాజెక్ట్కు చేరుకున్న అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Pocharam Project | డ్యామ్ సమగ్ర ఆనకట్ట భద్రత..
డ్యామ్ ఆనకట్ట భద్రత మూల్యాంకనాన్ని అధికారుల బృందం పరిశీలించింది. డ్యాం సేఫ్టీ యాక్ట్ ప్రకారం డిసెంబర్ 2026 గడువు కంటే ముందే సమగ్ర డ్యామ్ భద్రత మూల్యాంకనాలను పూర్తి చేయడానికి నిపుణుల బృందం సభ్యులు తనిఖీలు చేశారు. ప్రాజెక్ట్ కట్ట భద్రతను పరిశీలించడంతో పాటు, ప్రాజెక్ట్ కట్టపై కలియ తిరిగారు. ఆనకట్టకు అవసరమైన మరమ్మతులు, సేఫ్టీ పనులపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని నిపుణుల బృందం తెలిపినట్లు ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. పోచారం ప్రాజెక్టు (Pocharam Project) నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా నిపుణులు పరిశీలించారు. సీడీఎస్ఈవో నిపుణులు విజయ్ దేశాయ్, మురళీధర్, భవానీ రాం శంకర్, సత్యనారాయణ, ఎస్ఈ యశశ్వని, ఈఈ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy police controversy | సీఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలి – ఎస్పీకి ఆర్గొండ సర్పంచి ఫిర్యాదు

