అక్షరటుడే, మెండోరా: Heat Stroke Awareness | వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో రాజశ్రీ (DMHO Rajashree) పేర్కొన్నారు. పోచంపాడ్ (Pochampad) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు.
Heat Stroke Awareness | మందుల నిల్వలు, లాబరేటరీ పరిశీలన..
ఈ సందర్భంగా డీఎంహెచ్వో పీహెచ్సీలోని లాబరేటరీ, మందుల నిల్వ గదులను క్షుణంగా పరిశీలించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎండాకాలంలో సంభవించే వడదెబ్బపై మండలంలోని( Mendora) గ్రామాల్లో ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. 14 ఏళ్ల బాలికలు హెచ్పీవీ వ్యాక్సిన్(HPV Vaccine) తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని ఆమె వైద్యాధికారి మద్దుల రాజేష్ను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case|బండి భగీరథ్ అరెస్ట్ ఖాయం.. విదేశాలకు వెళ్లినా రప్పిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్

