అక్షరటుడే, మెండోరా: Biopesticides Usage | పంటలకు పురుగు మందులను అవసరమైన మోతాదు మేరకు వినియోగించాలని కీటక శాస్త్రవేత్త ఎం.సాయి చరణ్ సూచించారు. ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సమన్వయంతో మెండోరా (Mendora) రైతు వేదికలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహించారు.
Biopesticides Usage | బయోపెస్టిసైడ్స్ వినియోగించాలి
రైతులు (Farmers) పురుగు మందులను విచక్షణాయుతంగా మాత్రమే వినియోగించాలని కీటక శాస్త్రవేత్త సూచించారు. వేపనూనె, అజాడిరక్తిన్ వంటి బయోపెస్టిసైడ్స్ను ప్రారంభ దశలో ఉపయోగించాలన్నారు. పురుగుల తీవ్రత పెరిగిన తర్వాత మాత్రమే రసాయన మందులను వాడాలని తెలిపారు. లింగాకర్షక బుట్టల ద్వారా పురుగుల స్థాయిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
Biopesticides Usage | డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలి
మండల వ్యవసాయ అధికారి ఎస్.వైష్ణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట రకాలను సాగు చేయాలని తెలిపారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని చెప్పారు. వేల్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కె.ముత్యం రెడ్డి మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడి, లాభాలు సాధించవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి టి.సంధ్య రేఖ, గ్రామ సర్పంచ్ బి.ప్రమోద్, ఉప సర్పంచ్ ఎం.రాజేశ్వర్, కోడిచర్ల సర్పంచ్ వి.శ్రీనివాస్, ఎఫ్పీవో ఛైర్మన్ ఎన్.సాయి రెడ్డి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad DRO Appointments | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు డీఆర్వో, ఆర్డీవోల నియామకం

