అక్షరటుడే, బాన్సువాడ: Uttam Visit | బాన్సువాడకు (Banswada) 10న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) రానున్నారని ప్రభుత్వ(Government of Telangana) వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam) పేర్కొన్నారు. వర్ని మండలం జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవంతో పాటు సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పరిశీలనకు ఆయన వస్తున్నట్లు తెలిపారు.
Uttam Visit | ఏర్పాట్ల పరిశీలన..
మంత్రి పర్యటన ఏర్పాట్లను సోమవారం పోచారం పరిశీలించారు. సుమారు రూ.106 కోట్ల వ్యయంతో నిర్మించిన జాకోర (Siddapur Reservoir), చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపడుతున్న ఏర్పాట్లపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని వసతులను సమకూర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని, సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు (Irrigation Development), పారిశుధ్యం, పార్కింగ్ తదితర ఏర్పాట్లను సమీక్షించారు. మంత్రి పర్యటన షెడ్యూల్కు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, వర్ని, చందూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Niloufer Hospital Attack | నిలోఫర్ హాస్పిటల్లో పీజీ డాక్టర్పై దాడి.. అరెస్టు చేయాలని డిమాండ్
