Chicken Waste Seizure | 120 టన్నుల కోళ్ల వ్యర్థాలు స్వాధీనం.. వాటిని ఏం చేస్తారంటే?

హెచ్​ఫాస్ట్​ టీమ్​ అధికారులు 120 టన్నుల కోళ్ల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. చేపల చెరువుల కోసం వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chicken Waste Seizure | హైదరాబాద్ (Hyderabad) ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (HFast) భారీగా కోళ్ల వ్యర్థాలను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తుండగా పట్టుకుంది. చేపల చెరువులలోని చేపల మేతగా వాడేందుకు కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అంబర్‌పేట్, అత్తాపూర్, కూకట్‌పల్లి, పెద్ద అంబర్‌పేట్‌తో సహా పలు ప్రాంతాలలో సుమారు 120 టన్నుల కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న తొమ్మిది ట్రక్కులను అధికారులు అడ్డుకున్నారు. గుంటూరు, భీమవరం, వినుకొండ, అద్దంకిలోని చేపల చెరువులకు ప్రతిరోజూ వందల టన్నుల కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

Chicken Waste Seizure | అక్రమంగా..

కోళ్ల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించేందుకు GHMC రెండరింగ్ ప్లాంట్‌కు పంపాలి. కానీ కొందరు ముఠాగా ఏర్పడి వీటిని చేపల చెరువుకు తరలిస్తున్నారు. చేపలకు ఆహారంగా వేస్తున్నారు. అయితే ఈ వ్యర్థాలతో నీరు కలుషితం అవుతుంది. అయినా కూడా లాభాల కోసం అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు ఈ నెట్‌వర్క్‌కు చెందిన సభ్యులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Telangana Monsoon Arrival | చల్లని కబురు.. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *