Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Prajavani Complaints | ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (collector ila tripathi) అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి (prajavani nizamabad) కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి.

Prajavani Complaints | జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి..

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్​తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్​లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్, ఆర్డీవోల నేతృత్వంలో డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి (telangana governance) కార్యక్రమంలో సంబంధిత డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Sun TV Shares | తమిళనాడులో డీఎంకే ఓటమి.. కుప్పకూలిన సన్ టీవీ షేర్లు!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *