అక్షరటుడే, వెబ్డెస్క్: Stock Market | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళితో భారీ లాభాల దిశగా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్ .. తర్వాత ప్రాఫిట్ బుకింగ్తో వెనక్కి తగ్గింది. చివరికి లాభాలతో ముగిసింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 344 పాయింట్ల లాభంతో ప్రారంభమై 28 పాయింట్లు తగ్గింది.
అక్కడినుంచి తిరిగి పుంజకుని 681 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో ప్రారంభమై 2 పాయింట్లు తగ్గినా వెంటనే 229 పాయింట్లు ఎగబాకింది. కౌంటింగ్ సమయంలో మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. చివరికి సెన్సెక్స్ 355 పాయింట్ల నష్టంతో 77,269 వద్ద, నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 24,119 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | ఐటీ, టెలికాం, మీడియా రంగాలు మినహా..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)లో ఐటీ, టెలికాం, మీడియా రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్ లు లాభాల బాటలో సాగాయి. ఐటీ ఇండెక్స్ 0.95 శాతం, మీడియా ఇండెక్స్ 0.54 శాతం, టెలికాం 0.13 శాతం నష్టపోయాయి. నిఫ్టీ (Nifty) రియాలిటీ ఇండెక్స్ 2.41 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.11 శాతం, మెటల్ 1.09 శాతం, యుటిలిటీ 1.03 శాతం, ఫార్మా 0.89 శాతం, పవర్ 0.76 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.57 శాతం, ఆటో 0.42 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.38 శాతం లాభపడ్డాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో అదానీపోర్ట్స్ 5.30 శాతం, హెచ్ యÖఎల్ 2.60 శాతం, రిలయన్స్ 2.24 శాతం, ఎల్టీ 2.18 శాతం, ఎటర్నల్ 2.09 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఎయిర్టెల్ 3.14 శాతం, కొటక్ బ్యాంక్ 2.82 శాతం, టీసీఎస్ 1.76 శాతం, టెక్ మహీంద్రా 0.74 శాతం, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 1.33 శాతం, ఐటీసీ 1.25 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: TVS EV Sales | టీవీఎస్ మోటార్ జోరు.. గణనీయంగా పెరిగిన ఈవీ సేల్స్

