అక్షరటుడే, వెబ్డెస్క్: Anantapur Honey Trap | అనంతపురం జిల్లా (Anantapur District)లో కలకలం సృష్టించిన హనీట్రాప్ దందాలో ఇద్దరు సీఐలపై వేటు పడింది. ఈ దందాలో వారు కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇద్దరిని వీఆర్కు అటాచ్ చేశారు.
అనంతపురంలో కొందరు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాకు రంగమ్మ అనే మహిళ లీడర్గా వ్యవహరించేది. వీరు సమాజంలో గౌరవంగా జీవిస్తున్న ధనవంతులను టార్గెట్ చేస్తారు. కొందరు మహిళలు వారితో చాటింగ్ చేస్తారు. అనంతరం పరిచయం పెంచుకుంటారు. తర్వాత ఇంటికి పిలుస్తారు. ఇద్దరు కలిసి గడుపుతున్న సమయంలో ముఠా సభ్యులు రంగ ప్రవేశం చేస్తారు. ఆ సమయానికి బాధితుడు న్యూడ్గా ఉండేలా చేస్తారు. ఆ ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో పెడుతామని బెదిరింపులకు పాల్పడుతారు.
Anantapur Honey Trap | రూ.2 కోట్లు వసూలు
ఈ ముఠా పలువురి నుంచి ఇప్పటి వరకు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందా వెలుగులోకి రావడంతో కఠిన చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. అయితే నిందితులకు పలువురు పోలీసులు సైతం సహకరిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితురాలు లేడిడాన్ రంగమ్మను అరెస్ట్ చేశారు. మరో 10 మందిని విచారిస్తున్నారు. ఎస్పీ జగదీష్ (SP Jagadeesh)ను కలిసి పలువురు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. పరువు పోతుందని మరికొందరు సైలెంట్గా ఉంటున్నారు. రాప్తాడు సీఐ శ్రీహర్షకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయి. అలాగే బాధితులు ఫిర్యాదు చేస్తే అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వీరిద్దరినీ వీఆర్కు అటాచ్ చేశారు. ఈ కేసులో 10 మంది పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి..: Anantapur honey trap | హనీట్రాప్ కలకలం.. ఉచ్చులో రియల్టర్, జ్యోతిష్యుడు

