Bheemgal Car Accident | భీమ్‌గల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్​కు తృటిలో తప్పిన ప్రమాదం

భీమ్‌గల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బొదిరే నాగమణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్‌ : Bheemgal Car Accident | భీమ్‌గల్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బొదిరే నాగమణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Bheemgal Car Accident | ఆర్మూర్‌ నుంచి భీమ్‌గల్‌ వస్తుండగా..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్‌ నుంచి భీమ్‌గల్‌ (Bheemgal) వస్తుండగా మార్గమధ్యంలో కారు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఛైర్‌పర్సన్‌ నాగమణి, ఆమె భర్త స్వామి, కుమారుడు, కుమార్తె స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని, క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Bail Promise Theft | బెయిల్​ ఇప్పిస్తానని చెప్పి గుండ్లు దోచుకెళ్లాడు.. 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *