KTR Welfare Schemes | అధికారం శాశ్వతం కాదు.. ప్రజలకు మంచి చేయడమే ముఖ్యం: కేటీఆర్

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Welfare Schemes | అధికారం శాశ్వతం కాదని, అయితే ప్రజల కోసం చేసిన మంచి పనులు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు.

బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం అనేక గొప్ప కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు.

KTR Welfare Schemes | సంక్షేమ పథకాలను కొనసాగించాలి

పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేటీఆర్ తెలిపారు. ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించకపోవడం సరైంది కాదన్నారు. కేసీఆర్ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది పేదలకు మెరుగైన వైద్యం అందించామని తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలకు సేవ చేయడమే రాజకీయ నాయకుల ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై కూడా ఉందని, ప్రజలకు మంచి చేస్తేనే ఏ ప్రభుత్వానికైనా సార్థకత ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Sangareddy Road Accident | ఘోర ప్రమాదాలు.. తొమ్మిది మంది దుర్మరణం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *