అక్షరటుడే, వెబ్డెస్క్: Stock Market Rally | పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా.. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చల విషయంలో ముందడుగు పడవచ్చన్న అంచనాలతో స్టాక్ మార్కెట్ (Stock Market) కోలుకుంది.
కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు వాల్యూ బయ్యింగ్కు మొగ్గు చూపడంతో మÖడు రోజుల నష్టాల పరంపరకు బ్రేక్ పడింది. హెవీ వెయిట్ స్టాక్ అయిన రిలయన్స్తోపాటు ఐటీ, ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడంతో బెంచ్ మార్క్ సూచీలు పరుగులు తీశాయి.
Stock Market Rally | గ్యాప్ అప్ లో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం గ్యాప్ అప్ లో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 102 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 666 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో ప్రారంభమై 9 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి 194 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 639 పాయింట్ల లాభంతో 77,303 వద్ద, నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 24,092 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,075 కంపెనీలు లాభపడగా 1,288 స్టాక్స్ నష్టపోయాయి. 193 కంపెనీలు ఫ్లాట్గా ముగిశాయి. 171 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 43 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Stock Market Rally | అన్ని రంగాలు కళకళ..
దేశీయ స్టాక్ మార్కెట్ లో అన్ని రంగాల షేర్లు లాభాల బాటలో పయనించాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.62 శాతం, యుటిలిటీ ఇండెక్స్ 2.50 శాతం, రియాలిటీ 2.46 శాతం, మీడియా 2.30 శాతం, ఐటీ ఇండెక్స్ 2.20 శాతం, పవర్ 2.05 శాతం, మెటల్ 1.84 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.71 శాతం, ఐటీ 2.20 శాతం, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు 1.56 శాతం, టెలికాం 1.41 శాతం, ఎనర్జీ 1.40 శాతం పెరిగాయి.
Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్లో 22 స్టాక్స్ లాభపడగా.. 8 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. సన్ఫార్మా 7.03 శాతం, రిలయన్స్ 2.88 శాతం, అదానీపోర్ట్స్ 2.72 శాతం, టెక్ మహీంద్రా 2.64 శాతం, ఎంఅండ్ ఎం 2.20 శాతం లాభపడ్డాయి.
Top losers : యాక్సిస్ బ్యాంక్ 3.05 శాతం, బీఈఎల్ 2 శాతం, ట్రెంట్ 0.90 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.85 శాతం, ఎటర్నల్ 0.45 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: April 27 Gold Rates | తగ్గిన బంగారం ధర.. మార్కెట్లో మారుతున్న ట్రెండ్!

