అక్షరటుడే, వెబ్డెస్క్: AP 10th Results | ఆంధ్ర ప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ప్రకటించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్తో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మార్కులు చూసుకోవచ్చు.
AP 10th Results | 85 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు పదో తరగతి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 85శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది ఉన్నారు. 3,415 పరీక్ష కేంద్రాల్లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.
AP 10th Results | మే 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Examinations) నిర్వహించనున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 1 నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..: Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

