అక్షరటుడే, గాంధారి: KTS SSC Results | పదో తరగతి ఫలితాల్లో మండలంలోని కేటీఎస్ విద్యార్థులు (KTS Students) సత్తా చాటారు. మండలంలోని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ మేరకు స్కూల్ ప్రిన్సిపల్ పరశురాం వివరాలు వెల్లడించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులు కె రఘుచంద్ర 567 మార్కులతో మండల టాపర్గా నిలువగా.. మండల సెకండ్ టాపర్గా డి రష్మిత 566, తృతీయ స్థానంలో డి ఐశ్వర్య 555 మార్కులతో విజయకేతనం ఎగురవేశారన్నారు.
KTS SSC Results | పాఠశాలలో 99శాతం ఉత్తీర్ణత..
పాఠశాలలో ఈ ఏడాది 99శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులు చాలా కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారని.. పాఠశాలకు పేరు తెచ్చారన్నారు. దీనికి సహకరించిన కేటీఎస్ పాఠశాల డైరెక్టర్లు హరి సూరత్నం, విజయ్, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి..: Traffic Constable Help | రక్తదానం చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

