అక్షరటుడే, మెండోరా: Sriramsagar Project Flood | మండలంలోని శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. అయితే శుక్రవారం కంటే శనివారం ప్రాజెక్టుకు వరద తగ్గింది.
Sriramsagar Project Flood | 12,274 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12,274 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,078.20 అడుగుల వద్ద 40.304 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి కూడా ప్రాజెక్టులో 1,078.20 అడుగుల వద్ద 40.305 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు కలిపి మొత్తం 993 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది.

ఇది కూడా చదవండి..: కామారెడ్డిలోని ప్రధాన రోడ్డుపై వర్షం నీళ్లలో కూర్చుని బీఆర్ఎస్ నాయకుడు నిరసన వ్యక్తం చేశారు.