Minister Uttam | జల సంరక్షణ ఉద్యమంగా మారాలి : మంత్రి ఉత్తమ్

వర్షపు నీటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Minister Uttam | తెలంగాణ నీటిపారుదల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకీకృత జాతీయ చట్రం కోసం పిలుపునిచ్చారు. దీని ప్రకారం ప్రతి జలసంరక్షణ పని ఒకే జల-భద్రతా ప్రణాళికలో భాగంగా ఉండాలన్నారు.

న్యూఢిల్లీ (Delhi)లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో నిర్వహించిన ‘జల్ సంచయ్ జన భాగీదారీ’లో ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మాట్లాడారు. జల భద్రతను కేవలం ఒక ఇంజనీరింగ్ బాధ్యతగానో లేదా శాఖాపరమైన కార్యక్రమంగానో పరిగణించకూడదన్నారు. తాగునీరు, వ్యవసాయ స్థిరత్వం, గ్రామీణ జీవనోపాధి, పట్టణ స్థితిస్థాపకత మరియు పర్యావరణ పరిరక్షణకు కీలకమైన ఒక ప్రజా కర్తవ్యంగా చూడాలని అన్నారు.

Minister Uttam | ఉద్యమంగా మారాలి

వర్షపు నీటి సంరక్షణ (Rain Watere Harvesting) ఒక ప్రజా ఉద్యమంగా మారాలని ఉత్తమ్​ అన్నారు. గృహాలకు తగిన రీఛార్జ్ సౌకర్యాలు, వ్యవసాయ క్షేత్రాలకు సంరక్షణ నిర్మాణాలు, గ్రామాలకు నమ్మకమైన సామూహిక జలాశయాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 2025లో జల సంచయ్ జన భాగీదారీ పథకం కింద తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నారు. నీటి సంరక్షణలో భారతదేశంలోని 50 జిల్లాలలో 13 తెలంగాణ జిల్లాలు చోటు దక్కించుకున్నాయని వెల్లడించారు. పట్టణాల్లో ఇంటి పైకప్పులపై వర్షపు నీటి సేకరణను కఠినంగా అమలు చేయాలని, చెరువుల పునరుజ్జీవనానికి, వాటి ప్రవాహ కాలువలకు రక్షణ కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

దీనిని కూడా చదవండి : Minority Women Financial Aid | మైనారిటీ మహిళలకు చేయూత.. రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *