Youth Congress Nizamabad | యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Youth Congress Nizamabad | యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఐవైసీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్​ఛార్జి రోష్ని జైస్వాల్ (Roshin Jaiswal) అన్నారు. నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ (Nizamabad Youth Congress) జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అధ్యక్షతన నగరంలోని కాంగ్రెస్ భవన్​లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Youth Congress Nizamabad | కమిటీలకు పేర్లు ఇవ్వాలి..

రోష్ని జైస్వాల్, విపుల్ గౌడ్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న ప్రముఖ కాంగ్రెస్​ నాయకులంతా ఒకప్పుడు యూత్​ కాంగ్రెస్​లో ఉన్నవారేనన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన (Congress Government) బాగుందని.. అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యూత్ కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషించాలని వారన్నారు. అనంతరం గ్రామ, మండల, అసెంబ్లీ కమిటీలకు ఆశావహుల నుంచి పేర్లు ప్రతిపాదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి రాణి రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షుడు అద్నాన్, జనరల్ సెక్రెటరీ ఆదిత్య పాటిల్, మాజీ కార్పొరేటర్ గడుగు రోహిత్, అసెంబ్లీల అధ్యక్షుడు కార్తీక్ యాదవ్, మహేందర్, బైండ్ల ప్రశాంత్, మెయిన్ యూనిస్, నాయకులు ముబాసిర్, దినేష్, మతీన్, షోయబ్, గైని కిరణ్, యగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

congress1

congress23

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *