అక్షరటుడే, ఇందూరు: Youth Congress Nizamabad | యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఐవైసీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జి రోష్ని జైస్వాల్ (Roshin Jaiswal) అన్నారు. నిజామాబాద్ యూత్ కాంగ్రెస్ (Nizamabad Youth Congress) జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అధ్యక్షతన నగరంలోని కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Youth Congress Nizamabad | కమిటీలకు పేర్లు ఇవ్వాలి..
రోష్ని జైస్వాల్, విపుల్ గౌడ్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న ప్రముఖ కాంగ్రెస్ నాయకులంతా ఒకప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నవారేనన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన (Congress Government) బాగుందని.. అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యూత్ కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషించాలని వారన్నారు. అనంతరం గ్రామ, మండల, అసెంబ్లీ కమిటీలకు ఆశావహుల నుంచి పేర్లు ప్రతిపాదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి రాణి రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షుడు అద్నాన్, జనరల్ సెక్రెటరీ ఆదిత్య పాటిల్, మాజీ కార్పొరేటర్ గడుగు రోహిత్, అసెంబ్లీల అధ్యక్షుడు కార్తీక్ యాదవ్, మహేందర్, బైండ్ల ప్రశాంత్, మెయిన్ యూనిస్, నాయకులు ముబాసిర్, దినేష్, మతీన్, షోయబ్, గైని కిరణ్, యగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.




